Sania Mirza : భారత స్టార్ టెన్నిస్ లెజెండ్ సానియా మీర్జా కెరీర్లో ఆఖరి మ్యాచ్ ఆడేసింది. సొంత గడ్డపై ఆమె ఆడిన ఫేర్వెల్ ఎగ్జిబిషన్ మ్యాచ్లో స్టార్లు సందడి చేశారు. యువ హీరో దుల్కర్ సల్మాన్, మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, పాపులర్ ర్యాపర్ ఎంసీ స్టాన్ మ్యాచ్ చూసేందుకు విచ్చేశారు. ఆదివారం ఎల్బీ స్టేడియంలో జరిగిన సానియా ఫేర్వెల్ మ్యాచ్లో స్టాన్ ర్యాప్ గీతాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడు.
ముంబైలో ప్రదర్శనను వాయిదా వేసుకొని మరీ అతను సానియా ఫేర్వెల్ మ్యాచ్కు రావడం విశేషం. సానియా ఆఖరి మ్యాచ్కు ముఖ్య అతిథిగా ఐటీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఆయన వెంట పర్యాటక మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఉన్నారు.
ఫేర్వెల్ మ్యాచ్ సందర్భంగా సానియా భావోద్వేగానికి గురైంది. ఉబికివస్తున్న కన్నీళ్లను అదిమిపడుతూ మాట్లాడింది. ‘నాకు ఆరోజు ఆత్మీయ వీడ్కోలు పలికిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంతకంటే గొప్ప ఫేర్వెల్ నేను కోరుకోను. 2002లో ఇక్కడే నా ప్రయాణం మొదలైంది. నేషనల్ మెడల్స్ గెలిచాను. 2004లో కెరీర్లో తొలి డబుల్స్ టైటిల్ సాధించాను. 20 ఏళ్లుగా దేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని గౌరవంగా భావిస్తున్నా. చిన్న వయసులో.. అదీ ఒక అమ్మాయి టెన్నిస్ను కెరీర్గా తీసుకోవడం ఎంత కష్టమో చాలా మందికి తెలియదు. అయితే.. నా తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహించారు. ఒక్కటి మాత్రం చెప్పగలను. తెలంగాణ ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ కచ్చితంగా మరొక సానియాను తయారు చేస్తారు. మనకు మరింత మంది సానియాలు కావాలి. ఇవి ఆనందంతో వస్తున్న కన్నీళ్లు. మీ అందరినీ మిస్ అవుతున్నా’ అని సానియా తెలిపింది.
రెండు దశాబ్దాలు టెన్నిస్ ఆడిన సానియా మీర్జా భారత టెన్నిస్కు గుర్తింపు తీసుకొచ్చింది. ఎంతోమంది అమ్మాయిలు టెన్నిస్ ఆడేందుకు ప్రేరణ అయింది. డబుల్స్లో నంబర్ 1 ర్యాంకు సాధించింది. ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్లో రోహన్ బోపన్నతో జత కట్టిన ఆమె రన్నరప్గా నిలిచింది. దుబాయ్ ఓపెన్ ఛాంపియన్షిప్తో ఆమె టెన్నిస్కు వీడ్కోలు పలికింది. అయితే.. సొంత గడ్డపై అభిమానుల కోసం ఆఖరి మ్యాచ్ ఆడాలనుకుంది. అందుకోసం తాను 20 ఏళ్ల క్రితం టెన్నిస్ సాధన చేసిన ఎల్బీ స్టేడియంలో ఈరోజు ఫేర్వెల్ మ్యాచ్ ఆడింది. ఎగ్జిబిషన్ మ్యాచ్లో సానియా, రోహన్ బోపన్న టీమ్స్ తలపడ్డాయి. డబుల్స్లో సానియా – బోపన్న జోడీ ఇవాన్ డోడిగ్ – మ్యాటెక్ సాండ్స్ జంట పోటీ పడ్డాయి.
టెన్నిస్లో ఎన్నో విజయాలు సాధించిన సానియా మీర్జా మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో మెంటర్గా కొత్త పాత్రలో కనిపించనుంది.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మెంటార్గా ఆమె సేవలందిచనుంది. ఈమధ్యే జట్టుతో కలిసిన ఆమె చాలామంది అమ్మాయిలతో మాట్లాడాను. చాలామంది చిన్న చిన్న సిటీల నుంచి వచ్చారు. రాయల్ ఛాలెంజర్స్ మెంటర్గా ఎంపికైన విషయం తెలిసిందే. డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ ఈరోజు (మార్చి 4న) ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఆరంభ పోరులో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి.
@Dulquer Latest From #SaniaMirza farewell match in Hyderabad 💙✨
Fireee🔥🔥#DulquerSalmaan #KingOfKotha pic.twitter.com/DCPmE6QZEW— DQ Forever ❤️ (@MuhdShemim) March 5, 2023
@MCStanOfficial Visiting Tennis legend @MirzaSania in Hyderabad for Farewell match even Though he has concert At mumbai.
Sania Mirza the shining light of Indian tennis 🇮🇳(2003-2023)🇮🇳#SaniaMirza X #MCStan pic.twitter.com/I4ucrNZ1dV
— 𝑫𝑬𝑽𝑬𝑺𝑯 (@RealDevesh7) March 5, 2023