ముంబై: న్యూజిలాండ్తో జరుగుతున్న రెండవ టెస్టులో.. ఇండియన్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సెంచరీ కొట్టాడు. టెస్టుల్లో అతనికి ఇది నాలుగవ శతకం కావడం విశేషం. అగర్వాల్ సెంచరీలో 13 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. ఇవాళ ఉదయం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా తొలి వికెట్ను 80 రన్స్ వద్ద కోల్పోయింది. అయితే పుజారా, విరాట్లు కూడా అదే స్కోర్ వద్ద వెనుదిరిగారు. దీంతో ఇండియా కష్టాల్లో పడింది. కానీ అగర్వాల్ మాత్రం నిలకడగా ఆడాడు. స్కోర్ బోర్డును పరుగెత్తిస్తూ సెంచరీని పూర్తి చేశాడు. ప్రస్తుతం ఇండియా 62 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 200 రన్స్ చేసింది. అగర్వాల్ 102, సాహా 21 రన్స్తో క్రీజ్లో ఉన్నారు. గిల్ 44, అయ్యర్ 18 రన్స్ చేయగా.. పుజారా, కోహ్లీలు డకౌట్ అయ్యారు. కివీస్ బౌలర్ అజాజ్ పటేల్ ఒక్కడే నాలుగు వికెట్లు తీశాడు.