బెంగళూరు: సీనియర్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (110 బ్యాటింగ్; 11 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ శతకం బాదడంతో సౌరాష్ట్రతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో కర్ణాటక ఓ మాదిరి స్కోరు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన కర్ణాటక తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లకు 229 పరుగులు చేసింది. టాపార్డర్ విఫలం కాగా.. మయాంక్తో పాటు శ్రీనివాస్ శరత్ (58 బ్యాటింగ్) పర్వా లేదనిపించాడు. మధ్యప్రదేశ్తో జరుగుతున్న మరో సెమీఫైనల్లో తొలి రోజు బెంగాల్ 307/4తో నిలిచింది. సుదిప్ కుమార్ (112) అనుస్తుప్ మజుమ్దార్ (120) సెంచరీలతో కదం తొక్కారు.