ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. కొన్నిరోజుల క్రితం న్యూజిల్యాండ్ మాజీ సారధి బ్రెండన్ మెకల్లమ్ను ఇంగ్లండ్ టెస్టు జట్టుకు కోచ్గా నియమించిన ఈసీబీ (ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్).. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇంగ్లండ్ జట్టుకు మాథ్యూ మాట్ను కోచ్గా నియమించింది.
ఆస్ట్రేలియా మహిళల జట్టుకు గతంలో కోచ్గా పనిచేసిన మాట్.. నాలుగేళ్ల పాటు ఇంగ్లండ్ పురుషుల జట్టుకు సేవలు అందించనున్నారు. మాట్ కోచింగ్లో ఆస్ట్రేలియా మహిళల జట్టు అద్భుతంగా రాణించింది. రెండుసార్లు వరుసగా టీ20 ప్రపంచకప్లు గెలవడమే కాకుండా.. నాలుగు యాషెస్ సిరీసులను ఖాతాలో వేసుకుంది. అంతేకాదు, ఓటమి లేకుండా వరుసగా 26 వన్డేలు గెలిచి చరిత్ర సృష్టించింది. మరి మాట్ చేరికతో ఇంగ్లండ్ జట్టులో కూడా ఇలాంటి మార్పులే వస్తాయేమో చూడాలి.