లండన్: వింబుల్డన్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందన్న అనుమానాలు కలకలం రేపుతున్నాయి. కనీసం రెండు మ్యాచ్లపై విచారణ జరుగుతోంది. ఒక సింగిల్స్ మ్యాచ్, మరో డబుల్స్ మ్యాచ్పై ఫిక్సింగ్ ఆరోపణలు ఉన్నాయి. క్రమరహిత బెట్టింగ్ నమూనాలను గుర్తించిన అధికారులు.. ఆ రెండు మ్యాచ్లపై విచారణ జరుపుతున్నారు. కొన్ని బెట్టింగ్ సంస్థలు కూడా ఈ మ్యాచ్లపై జరిగిన బెట్టింగ్లపై సందేహాలు వ్యక్తం చేశాయి. మెన్స్ డబుల్స్ ఫస్ట్ రౌండ్ మ్యాచ్ ఈ అనుమానాస్పద లిస్ట్లో ఉంది. లైవ్ బెట్స్ చాలా ఎక్కువగా ఉన్న సమయంలో ఈ మ్యాచ్ ఫేవరెట్ జోడీ ఓడిపోయినట్లు పలు బెట్టింగ్ సంస్థలు ఫిర్యాదు చేశాయి.
ఈ జోడీ తొలి సెట్ గెలిచి తర్వాతి రెండు సెట్లను ఓడిపోయింది. ఇక మరొకటి జర్మన్ ప్లేయర్ ఆడిన ఫస్ట్ రౌండ్ సింగిల్స్ మ్యాచ్. అయితే ఆ ప్లేయర్ ప్రత్యర్థిపై ఈ మ్యాచ్లో అనుమానాలు ఉన్నాయి. సెకండ్ సెట్ తర్వాత పరిస్థితిపై ఐదు అంకెల మొత్తం బెట్టింగ్ నడిచినట్లు తేలింది. కచ్చితంగా ఫలితం కూడా అలాగే వచ్చింది. ఈ మ్యాచ్లో సర్వీస్ గేమ్స్ సంఖ్యపై కూడా ప్రత్యేక బెట్స్ నడిచాయి. ఈ రెండు మ్యాచ్లపై ఇంటర్నేషన్ టెన్నిస్ ఇంటెగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) విచారణ జరుపుతోంది. ఈ ఏడాది ఏప్రిల్, జూన్ మధ్య మొత్తం 11 మ్యాచ్లపై ఫిక్సింగ్ ఫిర్యాదులను ఐటీఐఏ అందుకుంది.