IND Vs NZ | మూడు వన్డేల సిరీస్ న్యూజిలాండ్ వశమైంది. క్రైస్ట్చర్చ్ వేదికగా జరిగిన మూడో వన్డే వర్షం కారణంగా నిలిపివేశారు. ఆట కొనసాగే పరిస్థితులు అనుకూలించకపోవడంతో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో 1-0తో సిరీస్ను న్యూజిలాండ్ జట్టు గెలుచుకుంది. మొదటి మ్యాచ్లో టీమిండియాపై న్యూజిలాండ్ విజయం సాధించగా.. రెండో వన్డే కూడా వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే.
క్రైస్ట్చర్చ్ వేదికగా ఇవాళ జరిగిన మూడో వన్డేలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 47.3 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ శిఖర్ ధావన్ 28 పరుగులు చేయగా, గిల్ 13, అయ్యర్ 49, పంత్ 10, సూర్యకుమార్ 6, దీపక్ హుడా 12, వాషింగ్టన్ సుందర్ 51, దీపక్ చాహర్ 12, చాహల్ 8, అర్ష్దీప్ 9 పరుగులు చేశారు. ఆ తర్వాత 220 పరుగలు లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆటగాళ్లు చెలరేగి ఆడారు. 18 ఓవర్లు ముగిసే సరిగి వికెట్ నష్టానికి 104 పరుగులు చేశారు. ఇంతలో వర్షం కురవడంతో మ్యాచ్ను నిలిపివేశారు. వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో చివరకు మ్యాచ్ను రద్దు చేశారు.
The third & final #NZvIND ODI is called off due to rain 🌧️
New Zealand win the series 1-0.
Scorecard 👉 https://t.co/NGs0HnQVMX #TeamIndia
📸 Courtesy: Photosport NZ pic.twitter.com/73QtYS5SJm
— BCCI (@BCCI) November 30, 2022