రాంచీ: న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గప్తిల్ కొత్త రికార్డు సృష్టించాడు. టీ20ల్లో అత్యధిక పరగులు చేసిన క్రికెటర్గా నిలిచాడు. కివీస్ ఓపెనర్ గప్తిల్.. ఇండియాతో జరిగిన రెండవ టీ20 మ్యాచ్లో ఆ ఘనతను అందుకున్నాడు. దీంతో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లీని గప్తిల్ దాటేశాడు. విరాట్ కోహ్లీ 87 ఇన్నింగ్స్లో 3227 రన్స్ చేశాడు. నిన్నటి వరకు రెండవ స్థానంలో ఉన్న గప్తిల్..రాంచీలో జరిగిన టీ20 మ్యాచ్లో చెలరేగి ఆడాడు. 15 బంతుల్లో 31 రన్స్ చేసిన అతను.. కోహ్లీ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును దాటేశాడు. ప్రస్తుతం గప్తిల్.. 107 ఇన్నింగ్స్లో 3248 రన్స్ చేశాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ లిస్టులో రోహిత్ శర్మ మూడవ స్థానంలో ఉన్నాడు. అయితే కివీస్తో జరగుతున్న టీ20 సిరీస్కు కోహ్లీ దూరమైన విషయం తెలిసిందే.