దుబాయ్: వెస్టిండీస్ మాజీ క్రికెటర్ మార్లోన్ సామ్యూల్స్పై వేటు పడింది. అవినీతి నిరోధక నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలడంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) గురువారం అతడిని ఆరేండ్ల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. 2019లో అబుదాబి వేదికగా జరిగిన టీ10 లీగ్ సందర్భంగా సామ్యూల్స్ నిబంధనలు ఉల్లంఘించినట్లు ఐసీసీ విచారణలో తేలింది. నిషేధం ఈనెల 11 నుంచి అమల్లోకి రానున్నట్లు ఐసీసీ పేర్కొంది.
లీగ్ సందర్భంగా సామ్యూల్స్ నిబంధనలను అతిక్రమిస్తూ పలు ప్రయోజనాలు పొందినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని అవినీతి నిరోధక బృందం దృష్టికి తీసుకువెళ్లని కారణంగా ఈ విండీస్ మాజీ క్రికెటర్పై సస్పెన్షన్ వేసినట్లు ఐసీసీ జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ పేర్కొన్నాడు. విండీస్ తరఫున 71 టెస్టులు, 207 వన్డేలు, 67 టీ20లు ఆడిన సామ్యూల్స్ 2018లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.