చెన్నై: టోక్యో పారాలింపిక్స్లో రజత పతకంతో మెరిసిన మరియప్పన్ తంగవేలుకు తమిళనాడు ప్రభుత్వం రూ.2 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. తంగవేలుకు అభినందనలు తెలిపారు. అతడు సాధించిన విజయాలు ఇతర క్రీడాకారులకు స్ఫూర్తినిస్తాయని చెప్పారు. 2016 రియో పారాలింపిక్స్లో స్వర్ణంతో పాటు టోక్యోలో రజతం నెగ్గిన తంగవేలును ‘గోల్డెన్ సన్ ఆఫ్ తమిళ్నాడు’గా స్టాలిన్ అభివర్ణించారు.