దోహా: డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీలో భారత జోడీ మనిక బాత్రా-సాతియాన్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన క్వార్టర్ఫైనల్లో భారత ద్వయం 3-0 తేడాతో ప్రపంచ 9నంబర్ స్పెయిన్ జంట మారియా జియావో-అల్వారో రోబెల్స్పై గెలిచింది. మనిక, సాతియాన్ జంట కేవలం 24 నిమిషాల్లోనే 11-9, 11-9, 11-5 స్కోరుతో ప్రత్యర్థిపై అలవోక విజయం సాధించారు. సెమీస్లో కొరియా జోడీ లిమ్ జాంగ్హూన్-షిన్ యుబిన్తో మనిక-సాతియాన్ తలపడతారు.