ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో భారత క్రీడాకారిణి మనికా బాత్ర ప్రయాణం ముగిసింది. మిక్స్డ్ డబుల్స్, వుమెన్స్ డబుల్స్ విభాగాల్లో ఆమె క్వార్టర్ ఫైనల్స్ చేరింది. కానీ అక్కడ ప్రత్యర్థుల చేతిలో ఓటమిపాలైంది.
మిక్స్డ్ డబుల్స్లో మనికా, సతియాన్ జ్ఞానశేకరన్ జోడీ.. జపాన్కు చెందిన టొమోకాజు హరిమోటో, హీనా హయాటా జంటతో తలపడింది. ఈ మ్యాచ్లో 5-12, 2-11, 11-7, 9-11తో మనికా జోడీ ఓడిపోయింది.
ఆ తర్వాత జరిగిన వుమెన్స్ డబుల్ పోటీల్లో మనికా, అర్జనా కామత్ జంట.. లగ్జెంబర్గ్కు చెందిన సారా ని డుట్టె, ని జియా లియాన్తో తలపడింది. ఈ మ్యాచ్లో 11-1, 11-6, 11-8 స్కోర్లతో మనికా జోడీ పరాజయం పాలైంది.