డెర్బి : ఇంగ్లండ్తో మంగళవారం జరిగిన రెండో టి20 మ్యాచ్లో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత ఇంగ్లండ్ను ఆరు వికెట్లకు 142 పరుగులకు పరిమితం చేసిన హర్మన్ప్రీత్ సేన లక్ష్యాన్ని 16.4 ఓవర్లలో 2 వికెట్లకు 146 పరుగులు చేసి విజయాన్నందుకుంది. తొలుత ఇంగ్లండ్ను భారత పేసర్ స్నేహ్రాణా పొదుపైన బౌలింగ్(3/24) తో అడ్డుకుంది. ఒక దశలో 54 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను ఫ్రెయా కెంప్(51) అజేయ అర్ధసెంచరీతో ఆదుకోవడంతో ఆమాత్రం స్కోరు సాధ్యమైంది. మయా బౌచర్ 34 పరుగులతో అండగా నిలిచింది. లక్ష్య ఛేదనలో ఓపెనర్ స్మృతి మందన అజేయ అర్ధసెంచరీ(79నాటౌట్)తో మెరవడంతో 16.4 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని అధిగమించింది.