వరుస ఓటములతో డీలా పడిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేసే అవకాశం ఉంది. ఓపెనర్ మనన్ వోహ్రా దారుణ ప్రదర్శనతో నిరాశపరుస్తున్నాడు. ఆడిన నాలుగు మ్యాచ్ల్లో కేవలం 42 పరుగులే చేశాడు. దీంతో అతని స్థానంలో ప్రతిభావంతుడైన యువ ఆటగాడు యశస్వి జైశ్వాల్ను తుది జట్టులోకి తీసుకోనున్నట్లు తెలిసింది. జోస్ బట్లర్ రెండు మ్యాచ్ల్లో మెరుగైన ప్రదర్శన చేసినా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. బట్లర్, వోహ్రా ఓపెనింగ్ జోడీ విఫలమవడంతో ప్రత్యామ్నాయాలపై టీమ్ మేనేజ్మెంట్ ఆలోచిస్తోంది.
బట్లర్తో శాంసన్ను ఓపెనర్గా పంపితే ఎలా ఉంటుందనేదానిపైనా జట్టు యాజమాన్యం చర్చించినట్లు సమాచారం. మరోవైపు కెప్టెన్ సంజూ శాంసన్ ఒక మ్యాచ్లో మినహా తర్వాత ఆడిన అన్ని మ్యాచ్ల్లో ఘోర బ్యాటింగ్ వైఫల్యం ఆందోళనకు గురిచేస్తోంది. సమిష్టిగా రాణించి తిరిగి గెలుపు బాట పట్టాలని ఫ్రాంఛైజీ ఆశిస్తోంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో కోల్కతా నైట్రైడర్స్తో రాజస్థాన్ శనివారం రాత్రి తలపడనుంది. సీజన్లో ఇప్పటి వరకు ఇరుజట్లు చెరో నాలుగు మ్యాచ్లు ఆడగా కేవలం ఒకటి మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి.