అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్ స్టేడియంలో ఆదివారం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ (World Cup final) సందర్భంగా ఒక వ్యక్తి అంతరాయం కలిగించాడు. సెక్యూరిటీ నిబంధనలు ఉల్లంఘించిన అతడు మ్యాచ్ పిచ్లోకి దూసుకెళ్లాడు. భారత ప్లేయర్ కోహ్లీని హగ్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఆ వ్యక్తి ధరించిన టీ షర్ట్ ముందు వైపు ‘పాలస్తీనాపై బాంబింగ్ ఆపండి’ అని వెనుక ‘ఫ్రీ పాలస్తీనా’ అని రాసి ఉంది. అలాగే పాలస్తీనా జెండా రంగులను పోలిన మాస్క్ను అతడు ధరించాడు. పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్ బాంబు దాడులకు వ్యతిరేకంగా ఈ సంఘటనకు పాల్పడ్డాడు.
కాగా, ఇది చూసి గ్రౌండ్లోని ప్లేయర్లు, స్టేడియంలోని ప్రేక్షకులతోపాటు సిబ్బంది షాక్ అయ్యారు. భద్రతను ఉల్లంఘించి పిచ్ వద్దకు వచ్చిన ఆ వ్యక్తిని స్టేడియం సిబ్బంది వెంటనే అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు అప్పగించగా పోలీస్ స్టేషన్కు తరలించారు. పాలస్తీనాకు మద్దతుగా ఆ వ్యక్తి ప్రవర్తించిన తీరుపై ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ సంఘటన వల్ల క్రికెట్ మ్యాచ్కు కాస్త అంతరాయం ఏర్పడింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
😭 https://t.co/huO0AUCeV6 pic.twitter.com/MsjYOFCXoA
— Ayush (@KohliAdorer) November 19, 2023
#WATCH | Gujarat: The man who entered the field during the India vs Australia Final match, brought to the Chandkheda Police Station in Ahmedabad pic.twitter.com/pm9AMyhsSi
— ANI (@ANI) November 19, 2023