ప్రపంచంలో ప్రతిచోటా సత్తా చాటి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీలంక దిగ్గజ పేసర్ మలింగ. ఇంతకుముందు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహించి.. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డుల్లో నిలిచాడీ పేసర్. ఆ తర్వాత ముంబై జట్టుకే బౌలింగ్లో పాఠాలు నేర్పాడు.
ఇప్పుడు ఈ లెజెండరీ పేసర్ను రాజస్థాన్ రాయల్స్ జట్టు కొనుగోలు చేసింది. తమ జట్టు పేస్ విభాగం కోచ్గా నియమించింది. ఈ సందర్భంగా మాట్లాడిన మలింగ.. గతేడాది కరోనా భయం నేపథ్యంలో కుటుంబంతో ఉండాలని నిర్ణయించుకున్నానని, ప్రస్తుతం పరిస్థితులు మెరుగవడంతో తనకు ప్రాణమైన ఆటకు ఏదో ఒకటి చేయాలని మళ్లీ తిరిగొచ్చానని చెప్పాడు.
రాజస్థాన్ జట్టులో అద్భుతమైన పేస్ దళం ఉందని, వారికి మార్గదర్శనం చేయడమే తన బాధ్యత అని చెప్పాడు. ‘‘నా అభిప్రాయం ప్రకారం, రాజస్థాన్ జట్టులో చాలా మంది భవిష్యత్తులో టీమిండియా స్టార్లు అవుతారు’’ అని కొనియాడాడు. ఈ జట్టులో చాలా ట్యాలెంటెడ్ ప్లేయర్లు ఉన్నారని, ఈ ఏడాది కచ్చితంగా అభిమానులు గర్వించేలా చేస్తామని మాటిచ్చాడు.