కౌలాలంపూర్: భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ మలేషియా ఓపెన్ క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-750 మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో సింధు 9-21, 21-9, 21-14తో చైవాన్ (థాయ్లాండ్)పై విజయం సాధించింది. దాదాపు గంట పాటు సాగిన పోరులో తొలి గేమ్ కోల్పోయిన సింధు.. ఆ తర్వాత వరుస గేమ్లు నెగ్గి క్వార్టర్స్లో అడుగుపెట్టింది.
పురుషుల సింగిల్స్లో గురువారం అన్సీడెడ్ ప్రణయ్ 21-15, 21-7తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ చౌ టైన్ చెన్ (చైనీస్ తైపీ)పై సంచలన విజయం సాధించాడు. అరగంటలో ముగిసిన పోరులో ప్రణయ్.. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విజృంభించాడు. క్వార్టర్స్లో తై జూ యింగ్తో సింధు, జొనాథన్ క్రిస్టీతో ప్రణయ్ అమీతుమీ తేల్చుకోనున్నారు. ఇతర మ్యాచ్ల్లో కశ్యప్ ఓటమి పాలవగా.. పురుషుల డబుల్స్లో సాత్విక్ -చిరాగ్ శెట్టి జంట గాయం కారణంగా పోటీ నుంచి తప్పుకుంది.