మలేషియన్ ఓపెన్ వాయిదా
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ ఆశలు సన్నగిల్లాయి. ఒలింపిక్స్ క్వాలిఫికేషన్ వ్యవధిలో చివరి రెండు అర్హత టోర్నీల్లో ఒకటైన మలేషియా ఓపెన్ కరోనా కారణంగా వాయిదా పడింది. ఆతిథ్య దేశంలో వైరస్ విజృంభణ వల్ల కౌలాలంపూర్లో ఈ నెల 25 నుంచి 30 వరకు జరుగాల్సిన టోర్నీని వాయిదా వేస్తున్నట్టు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) శుక్రవారం ప్రకటించింది. మరోవైపు ఒలింపిక్స్ క్వాలిఫికేషన్పై స్పష్టత ఇవ్వాలని బీడబ్ల్యూఎఫ్ను భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) కోరింది. కాగా భారత్ తరఫున స్టార్ షట్లర్ పీవీ సింధు, పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్శెట్టి ఇప్పటికే ఒలింపిక్స్కు అర్హత సాధించారు.