Malaysia Open 2024: కౌలాలంపూర్ వేదికగా జరుగుతున్న మలేషియా ఓపెన్లో టోర్నీ ఆసాంతం రాణించిన భారత స్టార్ బ్యాడ్మింటన్ ద్వయం, ప్రపంచ రెండో సీడ్ సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టిలు తుదిపోరులో తడబడ్డారు. ఆదివారం ముగిసిన పురుషుల డబుల్స్ ఫైనల్స్లో సాత్విక్ – చిరాగ్లు.. 21-9, 18-21 17-21 తేడాతో చైనాకు చెందిన వరల్డ్ నెంబర్ వన్ జోడీ వాంగ్ – లియాంగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. తద్వారా భారత ద్వయం రన్నరప్తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 58 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి సెట్ గెలిచినా తర్వాత రెండు సెట్లలో ఓడటంతో భారత ద్వయానికి పరాభవం తప్పలేదు.
ఫైనల్ దాకా అప్రతిహాత విజయాలతో వచ్చిన వరల్డ్ నెంబర్ 2 జోడీ.. తుది పోరులో మాత్రం తడబాటుకు గురైంది. తొలి సెట్లో ఈ ఇద్దరూ మ్యాచ్పై పూర్తి నియంత్రణ సాధించారు. భారత జోడీ ఫస్ట్ సెట్ గెలిచిన తర్వాత రెండో సెట్ నుంచి చైనా ద్వయం పుంజుకుంది. సర్వీస్ ఎర్రర్ కారణంగా రెండో సెట్ ఆరంభం నుంచే ఈ ఇద్దరూ మ్యాచ్పై కంట్రోల్ కోల్పోయారు. క్రమంగా మ్యాచ్పై పట్టుబిగించిన చైనా జోడీ.. చివరి వరకూ అదే కొనసాగించి విజేతగా నిలిచింది.
An amazing start to the year comes to an end🙌🔥
Proud of you boys 👏👏
📸: @badmintonphoto#MalaysiaOpen2024#IndiaontheRise#Badminton pic.twitter.com/nw4kJSZe9o
— BAI Media (@BAI_Media) January 14, 2024