కౌలాలాంపూర్: భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్కు దూసుకెళ్లగా మాజీ ప్రపంచ చాంపియన్ పీవీ సింధు సెమీస్లో ఓటమి పాలైంది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నీ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో శనివారం ప్రణయ్ 19-17తో క్రిస్టియన్ అడినటా (ఇండోనేషియా)పై ఆధిక్యంలో ఉన్న సమయంలో ప్రత్యర్థి గాయం కారణంగా తప్పుకోవడంతో ప్రణయ్ ముందంజ వేశాడు. మహిళల సింగిల్స్ సెమీస్లో సింధు 14-21, 17-21తో గ్రిగోరియా మరిస్కా చేతిలో ఓటమి పాలైంది.