హైదరాబాద్, ఆట ప్రతినిధి: మహీంద్ర యూనివర్సిటీలో దేశంలోనే తొలిసారి అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య(ఫిఫా) గుర్తింపు పొందిన పిచ్ అందుబాటులోకి వచ్చింది. స్థానిక క్యాంపస్లో శుక్రవారం యూనివర్సిటీ వీసీ ఆనంద్ మహీంద్ర..పిచ్ను ప్లేయర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ను ఆయన ఆస్వాదించారు.
చదువులకు మాత్రమే ప్రాధాన్యమివ్వకుండా మహీంద్ర విశ్వవిద్యాలయం క్రీడలకు పెద్దపీట వేస్తున్నది. ఈ క్రమంలో దేశంలో అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలతో ఫుట్బాల్ పిచ్ను రూపొందించింది. ఈ సందర్భంగా ఇటీవల ఆర్చరీ ప్రపంచకప్లో రెండు కాంస్య పతకాలు సాధించిన ఆర్యన్ను మహీంద్ర అభినందించారు.