సుల్తానాబాద్, సెప్టెంబర్ 22: గుజరాత్ వేదికగా త్వరలో జరుగనున్న జాతీయ గేమ్స్లో రాష్ట్ర జూడో జట్టుకు కోచ్ అండ్ మేనేజర్గా సిలివేరు మహేందర్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని రాష్ట్ర జూడో సంఘం ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు చెందిన మహేందర్ ప్రస్తుతం కరీంనగర్ మానేరు విద్యాసంస్థలో 19 ఏండ్లుగా వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఎంతో మంది విద్యార్థులను రాష్ట్ర, జాతీయ స్థాయి ప్లేయర్లుగా తీర్చిదిద్దాడు. మహేందర్ నియామకంపై పలువురు క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. మానేరు విద్యాసంస్థల అధినేత అనంతరెడ్డి, డీవైఎస్వో రాజవీరు, ఒలింపిక్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మహిపాల్, జనార్దన్రెడ్డి, హరిశంకర్ అభినందనలు తెలిపారు.