హైదరాబాద్, ఆట ప్రతినిధి: బెంగళూరు వేదికగా జరిగిన జాతీయ తైక్వాండో జూనియర్ చాంపియన్షిప్లో హైదరాబాద్కు చెందిన మహీన్ నవాజ్ పసిడి పతకంతో మెరిసింది. టోర్నీలో ఆద్యంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన మహీన్ 6.67 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచింది. తాను పోటీకి దిగిన విభాగంలో స్వర్ణం గెలిచిన తొలి ప్లేయర్గా మహీన్ నిలిచింది. మరోవైపు ఏషియన్ చాంపియన్షిప్లో భారత జట్టు తరఫున మహీన్ ప్రాతినిధ్యం వహించనుంది.