మాడ్రిడ్: మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ టోర్నీలో భారత షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన మహిళల ప్రిక్వార్టర్స్ పోరులో సింధు 21-16, 21-14 తేడాతో పుత్రి కుసుమ వర్ధాని(ఇండోనేషియా)పై అలవోక విజయం సాధించింది. అరగంటలోపే ముగిసిన పోరులో ప్రత్యర్థిపై సింధు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ క్రమంలో ఈ ఏడాది తొలిసారి క్వార్టర్స్ పోరులో నిలిచింది. పురుషుల ప్రిక్వార్టర్స్లో శ్రీకాంత్ 21-15, 21-12తో సాయి ప్రణీత్పై విజయంతో ముందంజ వేశాడు. ఐదోసీడ్గా బరిలోకి దిగిన శ్రీకాంత్..ప్రణీత్ను వరుస గేముల్లో ఓడించాడు.