లక్నోతో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరుకు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. నిలకడగా ఆడుతున్న విరాట్ కోహ్లీ (25) పెవిలియన్ చేరాడు. ఆవేష్ ఖాన్ వేసిన 9వ ఓవర్లో రూమ్ తీసుకొని భారీ షాట్ ఆడేందుకు కోహ్లీ ప్రయత్నించాడు. అయితే షార్ట్ బాల్ను సరిగా ఆడలేకపోవడంతో బ్యాట్ అంచును తాకి గాల్లోకి లేచిన బంతిని థర్డ్ మ్యాన్లో ఫీల్డింగ్ చేస్తున్న మొహ్సిన్ ఖాన్ అందుకున్నాడు. దాంతో కోహ్లీ నిరాశగా పెవిలియన్ చేరాడు. బెంగళూరు జట్టు 70 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.