లక్నోతో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న షాబాజ్ అహ్మద్ (26) రనౌట్ అయ్యాడు. జేసన్ హోల్డర్ వేసిన 16వ ఓవర్లో డుప్లెసిస్ కొట్టిన బంతికి సింగిల్ తీయడం కోసం షాబాజ్ ముందుకొచ్చాడు. అయితే డుప్లెసిస్ తన క్రీజులో నుంచి కదల్లేదు. కవర్స్కు చేరిన బంతిని అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ నేరుగా హోల్డర్కు విసిరాడు. దాన్ని అందుకున్న అతను వికెట్లను కూల్చాడు.
అయితే షాబాజ్ అవుటైందీ లేనిదీ నిర్ణయించలేకపోయిన అంపైర్లు థర్డ్ అంపైర్ సాయం కోరారు. వికెట్లు కూలే సమయానికి క్రీజు గీతపై షాబాజ్ బ్యాటు ఉంది. దీంతో షాబాజ్ ఇన్నింగ్స్ ముగిసింది. పదహారు ఓవర్లు ముగిసే సమయానికి బెంగళూరు జట్టు ఐదు వికెట్ల నష్టానికి 140 పరుగులతో నిలిచింది.