హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ జూనియర్ ఇంటర్నేషనల్ సిరీస్లో లోకేశ్, తన్వి విజేతలుగా నిలిచారు. హైదరాబాద్లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ వేదికగా జరిగిన ఈ టోర్నీ అండర్-19 బాలుర సింగిల్స్ ఫైనల్లో లోకేశ్ 13-21, 21-17, 21-11తో తిరుపతిపై గెలిచాడు. బాలికల సింగిల్స్ ఫైనల్లో తన్వి 20-22, 21-18, 21-13తో నవ్యపై నెగ్గి చాంపియన్గా నిలిచింది.
బాలుర డబుల్స్లో నికోలస్ రాజ్-తుషార్, మిక్స్డ్ డబుల్స్లో సాత్విక్ రెడ్డి-వైష్ణవి జోడీలు విజయం సాధించాయి. ఆదివారం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరినాథ్, శ్రీనివాస్, వెంకట్రావు, రామారావు, వంశీధర్ తదితరులు విజేతలకు ట్రోఫీలు అందజేశారు.