Lionel Messi | ఫిఫా ఫుట్బాల్ వరల్డ్కప్ ఫైనల్లోకి అర్జెంటీనా ప్రవేశించింది. క్రొయేషియాతో జరిగిన సెమీస్ మ్యాచ్లో అర్జెంటీనా 3-0 గోల్స్ తేడాతో విక్టరీ నమోదు చేసింది. లుసైల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో.. అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సి అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. ఈ సందర్భంగా మెస్సి సంచలన ప్రకటన చేశాడు. ఈ ప్రపంకచప్ ఫైనల్ మ్యాచే అర్జెంటీనా తరఫున తాను ఆడబోయే చివరి మ్యాచ్ అని స్పష్టం చేశాడు.
మ్యాచ్ అనంతరం మెస్సి మాట్లాడుతూ… ‘అర్జెంటీనా ఫైనల్స్కు చేరడం సంతోషంగా ఉంది. ఫైనల్స్ లో చివరి మ్యాచ్ అనంతరం నా ఫుట్బాల్ ప్రపంచకప్ ప్రయాణానికి ముగింపు పలుకుతున్నా. మరో ప్రపంచకప్కు చాలా సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు నేను ఇలాగే ఆడతానని అనుకోవడం లేదు. నా ప్రపంచకప్ ప్రయాణాన్ని ఇలా ముగించడమే బెస్ట్ అని అనుకుంటున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు.
క్రొయేషియాతో జరిగిన వరల్డ్కప్ సెమీస్ మ్యాచ్లో.. అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ అద్భుతమైన గోల్ చేశాడు. ఆట 34వ నిమిషంలో పెనాల్టీని గోల్గా మలిచాడు. నిజానికి క్రొయేషియా గోల్ కీపర్ లివాకోవిక్ ఆ షాట్ను సరైన రీతిలోనే అంచనా వేసినా.. మెస్సీ పవర్ఫుల్ కిక్ గోల్ పోస్టులోకి దూసుకువెళ్లింది. నెట్లో కొంచెం ఎత్తులోకి ఆ బాల్ ఎగురుతూ వెళ్లింది. ఈ గోల్తో మెస్సీ ఈ టోర్నీలో ఇప్పటి వరకు తన ఖాతాలో అయిదు గోల్స్ వేసుకున్నాడు. ఇక వరల్డ్కప్లలో అత్యధికంగా 11 గోల్స్ చేసిన అర్జెంటీనా ప్లేయర్గా మెస్సి నిలిచాడు.