హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆల్ఇండియా సబ్ జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీలో లాల్తజువాలా చాంపియన్గా నిలిచాడు. జైపూర్ వేదికగా జరిగిన ఈ టోర్నీ అండర్-17 బాలుర సింగిల్స్ ఫైనల్లో లాల్తజువాలా 21-16, 21-15తో మణీపూర్కు చెందిన హేమ్సింగ్పై గెలిచి టైటిల్ కైవసం చేసుకున్నాడు. పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో లాల్తజువాలా శిక్షణ పొందుతున్నాడు. అండర్-15 మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో సచిన్-అనన్య జంట రన్నరప్గా నిలిచింది. అండర్-15 బాలుర డబుల్స్లో మహీంద్ర-సమీఉల్లా ద్వయం రన్నరప్ ట్రోఫీ కైవసం చేసుకుంది. సబ్ జూనియర్ టైటిల్ విజేతలకు అకాడమీ సీనియర్ కోచ్ రాజేందర్, అనిల్, టోనీ, రోహిత్ బహుమతులు ప్రదానం చేశారు.