న్యూఢిల్లీ: బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడల చాంపియన్ లక్ష్యసేన్ కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్కు చేరుకున్నాడు. మంగళవారం బీడబ్ల్యూఎఫ్ విడుదల చేసిన ర్యాంకింగ్స్లో లక్ష్యసేన్ రెండు ర్యాంక్లు మెరుగుపరుచుకుని ఆరో ర్యాంక్కు చేరుకున్నాడు. 21 ఏండ్ల లక్ష్యసేన్ ఈ ఏడాది 25 టోర్నీల్లో పాల్గొని 76,424 పాయింట్లు సాధించాడు. పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ఏడో ర్యాంక్కు చేరుకోగా, మహిళల డబుల్స్ జోడీ గాయత్రి గోపీచంద్-త్రెసా జాలీ 23, మిక్స్డ్ డబుల్స్ ద్వయం ఇషాన్ భట్నాగర్-తనిషా క్రాస్టో 28వ ర్యాంక్కు చేరుకున్నారు. కామన్వెల్త్ క్రీడల అనంతరం గాయంతో టోర్నీలలో పాల్గొనని పీవీ సింధు ఒక స్థానం మెరుగై 5వ ర్యాంక్కు చేరుకుంది. కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్ 11, 12 ర్యాంక్లలో కొనసాగుతున్నారు.