జకార్తా : ఇండోనేషియా బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రపంచ 12వ ర్యాంకర్ భారత షట్లర్ లక్ష్యసేన్ పోరు ముగిసింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్లో లక్ష్య సేన్ 21-15, 10-21, 13-21 స్కోరుతో ఆసియా గేమ్స్ చాంపియన్, మూడో ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీ చేతిలో ఓడిపోయాడు.
62 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్లో తొలి గేమ్ గెలుచుకున్న లక్ష్యసేన్ ఆపై వరుసగా రెండు గేమ్లను కోల్పోయి టోర్నీనుంచి నిష్క్రమించాడు.