ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్యసేన్ వెండి పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ వంటి టాప్ ఆటగాళ్లు ఈ టోర్నీ నుంచి ముందుగానే నిష్క్రమించారు. ఇలాంటి పరిస్థితుల్లో అంచనాలకు అందని రీతిలో అద్భుతమైన పోరాట పటిమ చూపిన లక్ష్యసేన్ నేరుగా ఫైనల్కు దూసుకెళ్లాడు.
అయితే ఫైనల్లో డెన్మార్క్కు చెందిన ప్రపంచ నెంబర్ వన్ విక్టర్ ఆక్సెల్సన్తో జరిగి మ్యాచ్లో ఓడిపోయాడు. ఈ టోర్నీలో బంగారు పతకం ఆశలకు లక్ష్యసేన్ తెరదించుతాడని అందరూ భావించారు. కానీ ఆఖరిమెట్టుపై తడబడిన అతను సిల్వర్ మెడల్తో సరిపెట్టుకున్నాడు.
ఈ ఓటమిపై లక్ష్యసేన్ తల్లి నిర్మల స్పందించారు. ‘‘ఆటలో గెలవడం, ఓడిపోవడం సహజం. లక్ష్య గొప్పగా ఆడాడు. ఈ వయసులో ఇది తనకు దక్కిన గొప్ప అచీవ్మెంట్’’ అని ఆమె మెచ్చుకున్నారు.