హైదరాబాద్ (ఆట ప్రతినిధి): మెక్సికన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్, హైదరాబాద్కు చెందిన కృష్ణ ప్రసాద్ పురుషుల డబుల్స్ విభాగంలో పృథీ రాయ్ కలిసి టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఆదివారం రాత్రి జరిగిన ఫైనలో భారత జంట 21-18, 21-19 తేడాతో హుగో పోంగ్-కెర్న్ పోంగ్ జోడీపై విజయం సాధించింది.
మిక్స్డ్ డబుల్స్లో మరో హైదరాబాదీ కె. మనీషా-ధ్రువ్ రావత్ ద్వయం 19-21, 25-23, 22-24తో దవి సిల్వా -సానియా లిమా (బ్రెజిల్) చేతిలో ఓడి రన్నరప్గా నిలిచింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో భారత షట్లర్ వలిశెట్టి శ్రీయాన్షి 12-21, 21-16, 21-18తో జులియానా వియాన (బ్రెజిల్)ను ఓడించి టైటిల్ అందుకుంది.