పెర్త్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో విండీస్ ఓటమి తప్పించుకోడానికి పోరాడుతున్నది. ఇంకా ఒక రోజు మిగిలి ఉన్న నేపథ్యంలో విజయలక్ష్యం 498 ఛేదనలో వెస్టిండీస్ నాలుగో రోజు ఆట ముగిసేసరికి 3 వికెట్లకు 192 పరుగులు చేసింది. ఓపెనర్ క్రెగ్ బ్రాత్వైట్ అజేయ సెంచరీ(101)తో పోరాటం చేస్తున్నాడు. అంతకుముందు ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్ను 3 వికెట్లకు 192 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.
మార్నస్ లబుషేన్ 104 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీనితో టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే టెస్టులో డబుల్ సెంచరీ, సెంచరీ సాధించిన ఎనిమిదో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అంతకుముందు డగ్ వాల్టర్స్, సునీల్ గవాస్కర్, లారెన్స్ రో, గ్రెగ్ చాపెల్, గ్రాహం గూచ్, బ్రయాన్ లారా, కుమార సంగక్కర ఈ ఘనత సాధించారు.