IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్లో ఉత్కంఠ పోరాటాలు అభిమానులను అలరిస్తున్నాయి. 11 రోజులుగా ఈ మెగా టోర్నీని ఫ్యాన్స్ మస్త్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే.. కోల్కతా నైట్ రైడర్స్(KKR), రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) మ్యాచ్ తేదీ మారనుంది. ఈడెన్ గార్డెన్స్లో ఏప్రిల్ 17న జరగాల్సిన ఆ మ్యాచ్ను మరొక తేదీన లేదంటే వేరే స్టేడియంలో నిర్వహించే అవకాశముంది. ఎందుకో తెలుసా..? అదే రోజు శ్రీరామనవమి ఉంది.
దేశవ్యాప్తంగా శ్రీరామనవమి పండుగను భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. అందుకని ఆ రోజున కోల్కతాలోని పోలీస్ సిబ్బంది అంతా భద్రతా ఏర్పాట్లలో మునిగి ఉంటుంది. కాబట్టి క్రికెట్ మ్యాచ్కు పోలీస్ సెక్యూరిటీ కల్పించడం సాధ్యపడకపోవచ్చు. ఇదే విషయమై బీసీసీఐ, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్లు పోలీసు ఉన్నతాధికారులతో చర్చిస్తున్నాయి. త్వరలోనే . కోల్కతా, రాజస్థాన్ మ్యాచ్ షెడ్యూల్ గురించి ఐపీఎల్, బీసీసీఐ యాజమాన్యం ప్రకటన చేసే చాన్స్ ఉంది.
ఐపీఎల్ పదిహేడో సీజన్ మార్చి 22న ప్రారంభం అయింది. మొదట్లో ఏప్రిల్ 7 వరకే షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ తాజాగా పూర్తి షెడ్యూల్ను విడుదల చేసింది. దాంతో, ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ను విదేశాల్లో నిర్వహిస్తారనే వార్తలకు చెక్ పెట్టింది. మార్చి 26న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.