T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టు న్యూయార్క్లో వాలిపోయింది. ఈ ఏడాది అయినా ఐసీసీ ట్రోఫీ గెలవాలనే కసితో ఉన్న టీమిండియా(Team India) మెగా టోర్నీకి ముందు ఏకైక వామప్ మ్యాచ్ ఆడనుంది. అయితే.. జూన్ 1న బంగ్లాదేశ్(Bangladesh)తో జరిగే వామప్ మ్యాచ్కు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) దూరమయ్యే అవకాశముంది.
ఎందుకంటే..? మే 25 రోహిత్ శర్మతో కలిసి వెళ్లిన వాళ్లలో కోహ్లీ లేడు. ఐపీఎల్ పదిహేడో సీజన్లో విరాట్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) ఎలిమినేటర్లోనే ఇంటిదారి పట్టింది. దాంతో, ఆ బాధ నుంచి విరాట్ ఇంకా తేరుకోలేదు. దాంతో, అతడు జట్టుతో కలిసేందుకు తనకు కొంత సమయం కావాలని భారత క్రికెట్ బోర్డును విరాట్ కోరాడట. అందుకు బీసీసీఐ కూడా అమోదం తెలిపినట్టు సమాచారం. ఈమధ్యే రెండోసారి తండ్రైన కోహ్లీ కుమారుడు ‘అకాయ్'(Akay)తో కొన్ని రోజులు గడిపి.. మే 30వ తేదీన జట్టుతో కలిసే అవకాశముంది.
ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ముగియడంతో ఫైనల్ ఆడే భారత క్రికెటర్లు తప్ప మిగతావాళ్లంతా మే 25 శనివారమే అమెరికా ఫ్లైట్ ఎక్కేశారు. హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, రిషభ్ పంత్, శివం దూబే, కుల్దీప్ యాదవ్, సిరాజ్లు న్యూయార్క్ చేరుకున్నారు. టీమిండియా జూన 1 న బంగ్లాదేశ్తో వామప్ మ్యాచ్ ఆడనుంది. ఆ మ్యాచ్కు విరాట్ దూరం కానున్న నేపథ్యంలో అతడి స్థానంలో ఎవరిని ఆడిస్తారు? అనే ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. జూన్ 1న ఆరంభ వేడుకలతో వరల్డ్ కప్ టోర్నీ షురూ కానుంది.