దుబాయ్: షార్జాలో ఈ ఆదివారం హై వోల్టేజ్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. టీ20 వరల్డ్కప్లో ఆ రోజున పాకిస్థాన్తో ఇండియా తలపడనున్నది. ఆ మ్యాచ్ కోసం.. క్రికెట్ ప్రేమికులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత.. దాయాదుల మధ్య సమరం జరగనున్న నేపథ్యంలో ఆ మ్యాచ్ టికెట్లకు కూడా డిమాండ్ పెరిగింది. ఇక ఇండియన్ కెప్టెన్ కోహ్లీపై కూడా ఆ వత్తిడి పెరిగింది. షార్జా స్టేడియంలో జరిగే ఆ మ్యాచ్కు టికెట్లు కావాలంటూ.. కోహ్లీని అతని ఫ్రెండ్స్ అడుగుతున్నారు. ఇండోపాక్ మ్యాచ్ టికెట్లకు ఎక్కువ డిమాండ్ ఉందని, అంత మాత్రమే తనకు తెలుసు అని టీమిండియా కెప్టెన్ అన్నాడు. ఫ్రెండ్స్ టికెట్లు కావాలని అడుగుతున్నారని, కుడివైపు కావాలి, ఎడమ వైపు కావాలి అంటూ అడుగున్నారని, కానీ వారందరికీ వీలుకాదు అని చెప్పేస్తున్నానని కోహ్లీ అన్నాడు.