PBKS vs RCB : ధర్మశాలలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీ(67) హాఫ్ సెంచరీ బాదాడు. లివింగ్ స్టోన్ ఓవర్లో బౌండరీతో ఫిఫ్టీ సాధించాడు. ఈ లీగ్లో విరాట్కు ఇది 55వ అర్ధ శతకం. రజత్ పాటిదార్(55)తో కీలక భాగస్వామ్యం నెలకొల్పిన కోహ్లీ.. ఆ తర్వాత కామెరూన్ గ్రీన్(19)తో కలిసి బెంగళూరుకు భారీ స్కోర్ అందించే బాధ్యత తీసుకున్నాడు. వీళ్లిద్దరూ నాలుగో వికెట్కు 45రన్స్ జోడించారు. 15 ఓవర్లకు బెంగళూరు స్కోర్… 164/3.
చావోరేవో పోరులో పంజాబ్ అరంగేట్ర పేసర్ విధ్వత్ కవెరప్ప ఆర్సీబీని దెబ్బకొట్టాడు. తొలి ఓవర్లోనే కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(9)ను ఔట్ చేసిన కవెరప్ప.. తర్వాతి ఓవర్లో డేంజరస్ విల్ జాక్స్(12)ను వెనక్కి పంపాడు. దాంతో, 43 పరుగులకే బెంగళూరు రెండు వికెట్లు పడ్డాయి.
End of an exquisite knock!
Rajat Patidar walks back after scoring 55 off just 23 👏
Follow the Match ▶️ https://t.co/49nk5rrUlp#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/aCJ4YZrC1V
— IndianPremierLeague (@IPL) May 9, 2024
తర్వాత వచ్చిన రజత్ పాటిదార్(55) పంజాబ్ బౌలర్లను చితక్కొట్టాడు. 23 బంతుల్లోనే అర్ధ సెంచరీతో జట్టు స్కోర్ను పరుగులు పెట్టించాడు. ధాటిగా ఆడుతున్న అతడు బెయర్స్టోకు దొరికాడు. దాంతో, 119 పరుగుల వద్ద ఆర్సీబీ మూడో వికెట్ పడింది. ఆ వెంటనే వర్షం కాసేపు మ్యాచ్కు అంతరాయం కలిగించింది.