న్యూఢిల్లీ : రికార్డుల రారాజు, కింగ్ కోహ్లీ మరో మైలురాయిని అందుకున్నాడు. సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్లో వీక్షకుల సంఖ్య 25 కోట్లకు చేరుకున్న తొలి, ఏకైక భారత వ్యక్తిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. క్రీడల్లో ప్రపంచ వ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్లో ఇంతమంది ఫాలోవర్లను సంపాదించిన క్రీడాకారుల్లో కోహ్లీ మూడో స్థానంలో నిలిచాడు. క్రిస్టియానో రొనాల్డో, లియొనల్ మెస్సీ ముందున్నారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో కోహ్లీ అద్భుత ఫామ్లో ఉన్నాడు. 14 మ్యాచ్లలో రెండు సెంచరీలు, ఆరు అర్ధసెంచరీలతో మొత్తం 639 పరుగులు సాధించాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు 101 నాటౌట్.