IPL 2023 : సొంత గ్రౌండ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గర్జించింది. తొలుత ముంబై ఇండియన్స్ను 171 రన్స్కే కట్టడి చేసిన ఆర్సబీ.. ఆ తర్వాత ఓపెనర్లు డూప్లెసిస్(73), విరాట్ కోహ్లీ(82 నాటౌట్) అర్ధ శతకాలు బాదడంతో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. కింగ్ కోహ్లీ సిక్సర్ బాది మ్యాచ్ ముగించాడు. దాంతో, సొంత గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియంలో విజయంతో ఆర్సీబీ ఐపీఎల్ 16వ సీజన్ను ప్రారంభించింది.
ఐపీఎల్ ఐదో మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు భారీ విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ను 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. మొదట ముంబైని 171కే పరిమితం చేసింది. ఓపెనర్లు డూప్లెసిస్(73), విరాట్ కోహ్లీ(82 నాటౌట్) తొలి వికెట్కు 148 రన్స్ జోడించారు. . అర్షద్ ఖాన్ వేసిన 15వ ఓవర్లో డూప్లెసిస్(73) ఔటయ్యాడు. అప్పటికీ ఆర్సీబీ విజయానికి 30 బంతుల్లో 24 రన్స్ కావాలి. ఆ తర్వాత వచ్చిన కార్తిక్ డకౌట్ అయ్యాడు. అర్షద్ ఖాన్ వేసిన 17వ ఓవర్లో విరాట్ కోహ్లీ(82 నాటౌట్) సిక్స్ కొట్టి ఆర్సీబీని గెలిపించాడు. గ్రీన్ వేసిన 16వ ఓవర్లో గ్లెన్ మ్యాక్స్వెల్ (12) రెండు సిక్స్లు కొట్టాడు. దాంతో, విజయానికి 11 పరుగులు అవసరమయ్యాయి. ఆ తర్వాతి ఓవర్లో కోహ్లీ ఫోర్, సిక్స్ బాది లాంఛనం పూర్తి చేశాడు. ముంబై బౌలర్లలో అర్షద్ ఖాన్, గ్రీన్ తలా ఒక వికెట్ తీశారు.
మొదట బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ 171 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్ల ధాటికి ప్రధాన బ్యాటర్లంతా చేతులెత్తేశారు. యంగ్స్టర్ తిలక్ వర్మ(84) ఒక్కడే అర్ధ శతకంతో రాణించాడు. సూర్యకుమార్ యాదవ్ (15), నేహల్ వధీర (21) అతడికి సహకారం అందించారు. తిలక్ వర్మ చివరిదాకా నిలబడడంతో ముంబై పోరాడగలిగే స్కోర్ చేసింది. 20వ ఓవర్ తొలి బంతిని అర్షద్ ఖాన్(1) స్టాండ్స్లోకి పంపాడు. తిలక్ వర్మ(73) నాలుగో బంతికి ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత నోబ్. ఆఖరి బంతికి సిక్సర్. దాంతో ఆ ఓవర్లో 22 రన్స్ వచ్చాయి. వీళ్లిద్దరూ 8వ వికెట్కు 48 రన్స్ రాబట్టారు. ఆర్సీబీ బౌలర్లలో కరన్ శర్మ రెండు వికెట్లు తీశాడు. ఆకాశ్ దీప్, సిరాజ్, టోప్లే, బ్రేస్వెల్, హర్షల్ పటేల్ తలా ఒక వికెట్ తీశారు.
For his chase-special of 82*(49), @imVkohli becomes our 🔝 performer in the second innings of the #RCBvMI contest in #TATAIPL 💪
Take a look at his batting summary 🔽 pic.twitter.com/2KaArcBGiw
— IndianPremierLeague (@IPL) April 2, 2023