Virat Kohli : భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ(Virat Kohli) మరో మైలురాయిని అధిగమించాడు. అంతర్జాతీయ క్రికెట్లో పరుగుల వీరుడిగా రికార్డులు నెలకొల్పిన విరాట్.. టీ20ల్లో చరిత్ర సృష్టించాడు. పొట్టి ఫార్మాట్లో 12 వేల పరుగుల క్లబ్లో చేరాడు. ఐపీఎల్ 17వ సీజన్(IPL 2024) ఆరంభ పోరులో చెన్నై సూపర్ కింగ్స్పై కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. తద్వారా టీ20 క్రికెట్లో ఈ ఘనతకు చేరువైన తొలి భారత క్రికెటర్గా కోహ్లీ చరిత్రపుటల్లోకెక్కాడు. అతడు 360 ఇన్నింగ్స్లోనే 12 వేల పరుగులు సాధించడం విశేషం.
ఐపీఎల్ 17వ సీజన్ ఆరంభ పోరుకు ముందు కోహ్లీ ఖాతాలో11,994 పరుగులు ఉన్నాయి. చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్పై అతడు మరో ఆరు పరుగులు చేసిన రన్ మెషీన్ 12 వేల క్లబ్లో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతానికి టీ20ల్లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో విరాట్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. అంతేకాదు చెన్నైపై వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. గత సీజన్లో విరాట్ ఢిల్లీ క్యాపిటల్స్పై కూడా 1,000 పరుగులు బాదాడు.
First Indian to reach the 12000 T20 runs milestone 🫡#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #CSKvRCB #ViratKohli pic.twitter.com/Dh5rCn6nzl
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 22, 2024
వెస్టీండీస్ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్ 14,562 పరుగులతో టాప్లో ఉండగా.. పాకిస్థాన్ మాజీ ఆల్రౌండర్ షోయబ్ మాలిక్(12,993) రెండో స్థానంలో నిలిచాడు. కరీబియన్ మాజీ క్రికెటర్ కీరన్ పోలార్డ్ 12,430 రన్స్తో మూడో స్థానం దక్కించుకున్నాడు. వీళ్లలో గేల్, పోలార్డ్లు ఆటకు వీడ్కోలు పలికారు. దాంతో, షోయబ్, కోహ్లీల మధ్య ఆధిపత్య పోరు నడిచే అవకాశం ఉంది.