Asia Cup 2023: ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్లో భారత టాపార్డర్ చెలరేగి ఆడారు. విరాట్ కోహ్లీ(122 నాటౌట్ : 94 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లు), కేఎల్ రాహుల్(111 నాటౌట్ : 106 బంతుల్లో12 ఫోర్లు, 2 సిక్స్లు) శతకంతో విజృంభించారు. దాంతో, భారత జట్టు 2 వికెట్ల నష్టానికి 356 రన్స్ కొట్టింది. కోహ్లీ, రాహుల్ దాయాది పాకిస్థాన్ బౌలర్లను చీల్చిచెండాడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వీళ్లిద్దరూ దూకుడుతో పాక్ బౌలర్లు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు.
📸📸
The two centurions for #TeamIndia 💪💪 pic.twitter.com/mdMg5lNYHP
— BCCI (@BCCI) September 11, 2023
రిజర్వ్ డేన భారత జట్టు 24.1వ ఓవర్ నుంచి తమ ఇన్నింగ్స్ షురూ చేయనుంది. నిన్న వర్షం పడే సమయానికి ఇండియా రెండు వికెట్ల నష్టానికి 147 రన్స్ చేసింది. పాక్ పేస్ త్రయాన్ని ఉతికారేసిన ఓపెనర్లు రోహిత్ శర్మ(56), శుభ్మన్ గిల్(58)లు తొలి వికెట్కు 121 రన్స్ జోడించారు. అయితే వరుస ఓవర్లలో ఔటయ్యారు. ఆ తర్వాత కోహ్లీ, రాహుల్ మరో వికెట్ పడకుండా ఆడారు.
విరాట్ కోహ్లీ వన్డేల్లో 13వేల క్లబ్లో చేరాడు. షాహీన్ ఆఫ్రీదీ ఓవర్లో సింగిల్ తీసి కోహ్లీ శతకం పూర్తి చేసుకున్నాడు. దాంతో, వన్డేల్లో 47వ శతకం ఖాతాలో వేసుకున్నాడు. దాంతో 50 ఓవర్ల ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు బాదిన రెండో క్రికెటర్గా విరాట్ రికార్డు నెలకొల్పాడు.
13000 ODI runs and counting for 👑 Kohli
He also brings up his 47th ODI CENTURY 👏👏#TeamIndia pic.twitter.com/ePKxTWUTzn
— BCCI (@BCCI) September 11, 2023
అంతేకాదు భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ 49 శతకాల రికార్డుకు చేరువగా వచ్చాడు. రికీ పాంటింగ్, రోహిత్ శర్మ 30 వన్డే శతకాలతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు.
,