IND vs SA | టీమిండియా, సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ దిగిన భారత్ నిలకడగా ఆడుతోంది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ, పుజారా ఉన్నారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ అవుట్ కాగా.. కోహ్లీ, పుజారా బరిలోకి దిగారు. ఇద్దరు కలిసి తమ భాగస్వామ్యంతో హాఫ్ సెంచరీకి చేరువయ్యారు. చటేశ్వర్ పుజారా 64 బంతుల్లో 31 పరుగులు చేయగా.. కోహ్లీ 70 బంతుల్లో 16 పరుగులు చేశాడు. రెండు వికెట్ల నష్టానికి భారత్ 34 ఓవర్లలో 81 పరుగులు చేసింది.