మొహాలీ: అంకెలు అన్నిసార్లు పూర్తి కథ చెప్పవని టీమ్ఇండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు. క్లాసిక్ ప్లేయర్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ఓపెనర్ ఇటీవలి కాలంలో స్లో స్ట్రయిక్ రేట్ కారణంగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఆస్ట్రేలియాతో మంగళవారం తొలి టీ20 జరుగనున్న నేపథ్యంలో రాహుల్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏ ఒక్కరు పర్ఫెక్ట్ కాదని.. ప్రతి ఒక్కరు మెరుగయ్యేందుకు కృషి చేస్తుంటారని పేర్కొన్నాడు.
‘స్ట్రయిక్రేట్ అనేది ఓవరాల్ ప్రదర్శన ఆధారంగా ఉంటుంది. ఏ ఆటగాడైనా జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే ఆడతాడు. ఈ అంశంపై దృష్టి పెట్టా. ప్రతి ఆటగాడికి నిర్దేశిత లక్ష్యాలున్నాయి. ఓపెనర్గా మరింత మెరుగయ్యేందుకు కృషిచేస్తున్నా. గాయం నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్నా. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకునేందుకు జట్టులో చక్కటి వాతావరణం ఉంది’ అని రాహుల్ వివరించాడు. ఇక మంగళవారం పోరులో దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్లో ఎవరికి చోటు దక్కుతుందనే ప్రశ్నకు పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించాడు.