హెడ్డింగ్లీ: ఇంగ్లండ్తో జరుగుతున్న మూడవ టెస్టులో.. ఇండియా ఫస్ట్ వికెట్ కోల్పోయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ ( KL Rahul ) డకౌటయ్యాడు. అండర్సన్ వేసిన తొలి ఓవర్లోనే.. కీపర్ క్యాచ్ ఇచ్చి రాహుల్ వెనుదిరిగాడు. తొలుత కొన్ని బంతులు ఇన్ స్వింగ్ వేసిన అండర్సన్.. ఆ తర్వాత ఫుల్ లెన్త్ బాల్తో రాహుల్ను బోల్తా కొట్టించాడు. కీపర్ బట్లర్ ఈజీగా రాహుల్ క్యాచ్ అందుకున్నాడు. తాజా వార్తలందేసరికి ఇండియా రెండు రన్స్ చేసింది. రోహిత్, పుజారా క్రీజ్లో ఉన్నారు. అంతకముందు టాస్ గెలిచిన ఇండియా మొదట బ్యాటింగ్ ఎంచుకున్నది. లార్డ్స్లో విక్టరీ సాధించిన టీమ్తోనే కోహ్లీసేన రంగంలోకి దిగింది. ఇంగ్లండ్ జట్టులోకి వుడ్ స్థానంలో క్రెయిగ్ ఓవర్టన్ వచ్చాడు. సిబ్లే స్థానంలో మలాన్ను తీసుకున్నారు. 5 టెస్టుల సిరీస్లో ఇండియా 1-0 ఆధిక్యంతో ఉన్న విషయం తెలిసిందే.