టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ను చూస్తుంటే ఏం చెయ్యలేడనిపిస్తోందని, అతన్ని పక్కనపెట్టి రిషభ్ పంత్ను జట్టులోకి తీసుకోవాలని మాజీ పేసర్ ఆర్పీ సింగ్ అంటున్నాడు. ఆసియా కప్లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరిన రాహుల్.. హాంగ్కాంగ్తో జరిగిన మ్యాచ్లో టెస్టు ఇన్నింగ్స్ (39 బంతుల్లో 36 పరుగులు) ఆడాడు.
దీనిపై మాట్లాడిన ఆర్పీ సింగ్.. రిషభ్ పంత్ మ్యాచ్ విన్నర్ అని, అతన్ని జట్టులోకి తీసుకోవాలని అన్నాడు. ‘‘డీకే లేదా రాహుల్ను పక్కనపెట్టి పంత్ను తీసుకోవాలి. అతను ఆడితే జట్టును సులభంగా గెలిపిస్తాడు. రాహుల్ ఆడతాడని నాకు అనిపించడం లేదు. తన బాడీ లాంగ్వేజ్ చూస్తే ఏం చెయ్యలేడని అనిపిస్తోంది. అతనికి మరింత టైం కావాలి. గాయం నుంచి కోలుకున్నాక టైమింగ్ కోల్పోయాడు. మ్యాచ్ పరిస్థితిని అర్థం చేసుకోలేకపోతున్నాడు’’ అని సింగ్ చెప్పాడు.