హరారే: భారత్ మరో పోరుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా గురువారం జింబాబ్వేతో టీమ్ఇండియా తలపడనుంది. ఇంగ్లండ్, వెస్టిండీస్ వరుస పర్యటనల్లో సిరీస్ విజయాలతో జోరుమీదున్న భారత్..జింబాబ్వే పనిపట్టాలని చూస్తున్నది. రెగ్యులర్ ప్లేయర్ల గైర్హాజరీలో యువకుల మేళవింపుతో కనిపిస్తున్న టీమ్ఇండియా..జింబాబ్వేను వారి సొంతగడ్డపై మట్టికరిపించాలన్న పట్టుదలతో ఉంది. గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన కేఎల్ రాహుల్పైనే అందరి దృష్టి నెలకొంది.