మొహాలీ: ఐపీఎల్(IPL 2023)లో ఇవాళ కోల్కతా, పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనున్నది. మొహాలీలో జరగనున్న మ్యాచ్లో టాస్ గెలిచిన కేకేఆర్(Kolkata Knight Riders) జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకున్నది. వర్షం వల్ల పిచ్లో ఉన్న తేమను వాడుకోవాలనుకుంటున్నట్లు కేకేఆర్ కెప్టెన్ రాణా(Captain Rana) తెలిపాడు. కెప్టెన్గా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నాడు. ఆ జట్టులో సౌథీ, రసల్, నరేన్, గుర్బాజ్ లాంటి విదేశీ క్రికెటర్లు ఉన్నారు. ఒకవేళ టాస్ గెలిస్తే తాను కూడా బౌలింగ్ ఎంచుకునేవాడినని ధావన్ తెలిపాడు. పంజాబ్ జట్టు(Punjab Kings)లో రాజపక్ష, కర్రన్, ఎల్లిస్లు విదేశీ క్రికెటర్లు లిస్టులో ఉన్నారు. నిన్న జరిగిన ఐపీఎల్ తొలి మ్యాచ్లో గుజరాత్ గెలిచిన విషయం తెలిసిందే.
Here's how the two teams are placed ahead of the #PBKSvKKR encounter!
Follow the match – https://t.co/UeBnlhdZdr#TATAIPL pic.twitter.com/qQEEyyeffB
— IndianPremierLeague (@IPL) April 1, 2023