లక్నోతో జరుగుతున్న మ్యాచ్లో ధాటిగా ఆడిన కోల్కతా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (50) అవుయ్యాడు. ఓపెనర్లు విఫలమైన చోట నితీష్ రాణా (42)తో కలిసి చక్కని ఇన్నింగ్స్ నిర్మించిన శ్రేయాస్.. జట్టును ఆదుకున్నాడు. హాఫ్ సెంచరీతో జట్టుకు మంచి స్కోరు అందించాడు. అయితే ఇన్నింగ్స్ వేగం పెంచే క్రమంలో స్టొయినిస్ వేసిన 14వ ఓవర్లో పెవిలియన్ చేరాడు. స్లో బాల్ను అంచనా వేయలేకపోయిన శ్రేయాస్.. డీప్ మిడ్ వికెట్ మీదుగా దాన్ని బౌండరీకి తరలించే ప్రయత్నం చేశాడు. అయితే అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న దీపక్ హుడా అద్భుతంగా క్యాచ్ పట్టేయడంతో పెవిలియన్ చేరాడు.