జకార్త: ఇండోనేషియా మాస్టర్స్ టోర్నీలో భారత షట్లర్లు కిరణ్జార్జ్, లక్ష్యసేన్ ముందంజ వేయగా, కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్ నిష్క్రమించారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్లో కిరణ్జార్జ్ 18-21, 21-16, 21-19తో జూనియర్ పొపోవ్(ఫ్రాన్స్)పై గెలిచాడు.
మరో సింగిల్స్లో లక్ష్యసేన్ 24-22, 21-15తో వెంగ్హాంగ్(చైనా)పై అలవోక విజయం సాధించాడు. మిగతా మ్యాచ్ల్లో ప్రణయ్ 18-21, 21-19, 10-21తో కీన్ యు చేతిలో ఓడగా, శ్రీకాంత్ 21-19, 14-21, 11-21తో లీ జీ జియాపై ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు.