Srikanth Kidambi | బాసెల్ : స్విస్ ఓపెన్ సూపర్ 300 టోర్నీలో భారత పోరాటం ముగిసింది. సుమారు 16 నెలల (2022 నవంబర్ నుంచి) తర్వాత ఒక బీడబ్ల్యూఎఫ్ సూపర్ టోర్నీలో సెమీస్కు చేరిన కిడాంబి శ్రీకాంత్.. ఫైనల్కు ముందే చేతులెత్తేశాడు. శనివారం ముగిసిన పురుషుల సింగిల్స్ సెమీస్లో శ్రీకాంత్.. 21-15, 9-21, 18-21 తేడాతో లిన్ చున్ యి (చైనీస్ తైఫీ) చేతిలో పరాభవం పాలయ్యాడు. తొలి గేమ్లో దూకుడైన షాట్లతో ప్రత్యర్థిపై విరుచుకుపడిన శ్రీకాంత్.. రెండో గేమ్లో లయ తప్పాడు. చివరి గేమ్లో ఇరువురూ హోరాహోరి పోరాడినా లిన్ చున్ నే విజయం వరించింది.